జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపీ దరీయసీ.
గరగ మహర్షి తపస్సు చేసి ముక్తి పొందిన తపోభూమి. ఆయన పేరు మీదుగా గరగపర్రు అని పిలవ బడుతున్నది. ఆ తపో గంగ ఈనాటికీ మా గ్రామంలో ప్రవహిస్తూనే ఉంది. ఇరువురు బాల యోగులు 1) శ్రీ వీర రాఘవ యోగి 2) శ్రీ నాగయోగి ఈ గ్రామమందు జన్మించి ఎన్ని ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడినా, ఎన్ని అడ్డంకులు ఏర్పడినా చలించక నిశ్చలంగా ఘోర తపస్సు చేసి ముక్తి పొందిన ముక్తి స్థానమిది.
మా గ్రామానికి తూర్పున సాగర సంగమంచేస్తున్న యనమదుర్రు కాలువ, పడమరన ఎన్నో వేల ఎకరాలకు, ప్రజలకు మంచినీటిని అందిస్తున్న పంట కాలువ (ఉండి కాలువ), ఉత్తరమున అఖిలాండ కోటి భ్రహ్మాండనాయకుడు రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాద్ మహారాజ్, అభయాంజనేయుల ఆలయాలు, దక్షిణమున అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ శ్రీ కనకదుర్గా భవానీ ఆలయం వీని మద్య విరాజిల్లుతున్న విరుబోణి మాగ్రామం. మాగ్రామంలోనికి ఎవరు ఏదిక్కుగా ప్రవేశించినా ముందు ఆలయ దర్శనం చెయ్యాలి. రెండు కాలువల మద్య తాటి తోపులతో గ్రామం మద్యన చెరువులతోనూ భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెల్లే రహదారి గ్రామ మద్యలోనుండి వెల్లుట విశేషం చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. మా గ్రామం దైవజ్ఞులకు, విజ్ఞానులకు, ప్రాజ్ఞాలకు, సామాన్యులకు, మాన్యులకు, అనన్య సామాన్యులకు, దేశభక్తులకు, దైవభక్తులకు, భాగవతోత్తములకు, గురువర్యులకు, సజ్జనులకు, సదాచార సంపన్నులకు, అపర కుబేరులకు, వినయశీలులకు, విద్యావంతులకు, వ్యాపార వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు, దాతలకు, దయాశీలులకు, వ్యవహారదక్షులకు, పాలనదక్షులకు, సహనశీలులకు, పుట్టినిల్లు.
మా గ్రామం ఆద్యాత్మక చింతనకు ఆలవాలం. ఆర్తులను, అన్నార్తులను, అనాధలను ఆదుకొనే కల్ప వృక్షం. సంవత్సరం పొడవునా గ్రామంలో ఏదో ఒక ఆద్యాత్మక కార్యక్రమాలు నిర్వహించబడడం గ్రామ ప్రజలందరూ కులాతీతంగా మతా తీతంగా, కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయడం ఈ గ్రామ విశిష్టత.
నిర్వహించడం మా గ్రామ ప్రజలఅదృష్టం. మా గ్రామం లో వయో వృద్ధులుకు సన్మానం చేసి సత్కరించడం వారికి వృద్దులందునున్న భక్తి విశ్వాసాలకు ఉదాహరణ. హరిజన వాడలో కమ్యూనిటీ హాలుని నిర్మించి హరిజనులకు తగిన సౌకర్యం ఏర్పాటు చేయుట వారి మానవతావాదానికి చక్కని ఉదాహరణ..
::రచన: దండు సత్యనారాయన రాజు (దండు మాస్టారు)::
గ్రామంలో అన్నికులాలు, అన్ని మతాలు కలవు. కాని అందరిదీ ఒకే మాట ఒకే బాట. అందరూ పొరపొచ్చాలు లేక సోదర భావంతో ఒకరికొకరు సహకారం అందించుకొని అనేకత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే ఆదర్శ గ్రామం మాది. పర్వదినాలలో ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వ హించడమే కాకుండా పేద సాదలకు, అన్నదానం, వస్త్రదానం చేసి సాటి మానవునిలో మాధవుని దర్శించే మహోన్నత వ్యక్తిత్వం మా గ్రామ ప్రజల స్వంతం. మాగ్రామం చిరకాలం నుండి సేవాదృక్పదం, ప్రేమ తత్వం సదాచార సంపన్నం. అందుకు నిదర్శనం మా గ్రామాల్లో వెలసిన సేవా సంస్థలు.
1). బైర్రాజు ఫౌండేషన్.
2). వసుధా ఫౌండేషన్.
బైర్రాజు ఫౌండేషన్.
ఆంద్రప్రదేశ్ సంఘ సేవా కార్యక్రమాల్లో గ్రామ వికాసానికి అహర్నిశలు కృషి చేస్తున్న బైర్రాజు ఫౌడేషన్ వ్యవస్థాపకులు శ్రీ బైర్రాజు సత్యనారయణ రాజు మాగ్రామ ముద్దు బిడ్డ. వ్యక్తి గా జన్మించి మహా శక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కృషితో ఎదిగిన ఋషి ఎందరికో జీవనజ్యోతి ఆదర్శ కృషీవలుడు, పారిశ్రామిక వేత్త విద్యాదాత, అకుంఠిత దీక్షా దక్షుడు, అపర కుబేరుడు, ఎందరికో మార్గదర్శి, అపర కర్ణుడు, "సత్యం కప్యూటర్స్" ద్వారా తెలుగు తేజాన్ని నేలకు నాలుగు చరగులా వ్యాపింపచేసిన క్షత్రియ తేజం, అక్షరాలలో ఒదగని విశిష్ఠ వ్యక్తి. రాష్ట్రంలో పలు గ్రామాలలో బైర్రాజు ఫౌండేషన్ స్థాపించి వాని ద్వారా ఆయాగ్రామ ప్రజలకు విద్యా, వైద్యా సేవలందిస్తున్న వారి సేవ అనన్యసామాన్యం. బైర్రాజు ఫౌండేషన్స్, సత్యం కంప్యూటర్స్ వాని అనుబంద సంస్థలు. అనేక మందికి జీవనోపాధిని కల్పించడమే గాక వారిని, వారి కుటుంబాలను చిరస్థాయిగా ఉన్నత శిఖరాలను అధిరోహింపచేయుట వారి విశాల హృదయానికి దానశీలతకు ప్రత్యక్ష నిదర్శనం. హైదరబాదు కు ధ్రాక్ష పంటను పరిచయం చేయటమే కాకుండా అనన్య సామాన్య రీతిలో అభివృద్ది చేసి ఆంద్రప్రదేశ్ ను జాతీయ స్థాయిలోగుర్తింపు తీసుకొచ్చారు.
తండ్రికి తగిన తనయునిగా శ్రీ రామలింగ రాజు సమర్థవంతంగా నిర్వహింపచేయటమే గాక ప్రపంచ నాయకుడు అమెరికా ప్రెసిడెంట్ శ్రీ బిల్ క్లింటన్ గారి అభినందనలు అందుకున్న ఏకైక క్షత్రియ తేజం.
కాలం విచిత్రమైనది, కాలం కనికరం లేనిది, కాలం స్థితిగతులను మార్చుతుంది, కాలానికి ఎవ్వరూ అతీతులు కారు ప్రస్థుతం శ్రీ రామ లింగరాజు గారు రాహు గ్రస్థ రవిబింబం.
శ్రీ బైర్రాజు అప్పలరాజు గారి కుమార్డు శ్రీ స్వామీజీ రాజు (శివాజీ రాజు) భారత సైన్యంలో లెఫ్ట్ నెంట్ కన్లల్ గా పనిచేసి వీరొచితంగా పోరాడి వీర స్వర్గం అలంకరిచారు. వారి దేశభక్తికి గ్రామం జోహారులర్పిస్తుంది.
2) వనుధా ఫౌండేషన్.
మధుర మనస్వి, సత్వగుణ సంపన్నుడు, మితభాషి, కుల, విద్య, రూప, సౌజన్య, శ్రీ, బల, ధాన సంపన్నుదు, ఎంత ఎదిగినా అంతగా ఒదిగి ఉండే వినయశీలి అలుపెరుగని కృషీవలుడు, "అన్న" మాటను అక్షరాలా ఆచరించి చూపే ఆచరణశీలి, మానవత్వానికి పెన్నిధి, పారిశ్రామికా వేత్త శ్రీ మంతెన వీరబద్ర రాజు గారి ద్వితియ కుమారుడు శ్రీ మంతెన వేంకటరామరాజు గారు. వసుధా ఫౌండేషన్ ను స్థాపించి అన్నగారైన శ్రీ మంతెన కృష్ణంరాజు గారి సారద్యంలో వారి అడుగు జాడలలో ఆంద్రప్రదేశ్ లో అనేక గ్రామాలలో వృద్దులకు పించన్లు, బట్టలు ఆహారదినుసులు విద్యార్దులకు వారి స్థాయిని బట్టి ఉపకార వేతనములు, పాఠశాలల విద్యార్ధులకు ఉచితంగా బట్టలు, పుస్తకాల పంపిణీ, వివిధ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు, గ్రామావసరాలను బట్టి ఆయాగ్రామ ప్రజలను ఆదుకుటాం మీ వెనుక మేముంటాం అని అనేక విద్యా సంస్థలకు, సేవా సంస్థలకు, వృద్దాశ్రమాలకు, వైద్యశాలలో రోగులకు, తమ యొక్క సహకారాన్ని అందించడమే గాక మా గ్రామం లో విశాలమైన ప్రాంతంలో పచ్చని పొలాల మద్య ఆహ్లాదకరమైన వాతారణంలో వసుధా ఫౌండేషన్ ద్వారా వృద్దాశ్రమం, అనాధ బాలల వాత్సల్యనియం స్థాపించి అన్నగారైన శ్రీ కృష్ణంరాజు గారి ఆధ్వర్యంలో,
::రచన: దండు సత్యనారాయన రాజు (దండు మాస్టారు)::
ch.ramakrishnamraju
Telugu is the Local Language here. Total population of Garagaparru is 4812 .Males are 2422 and Females are 2,390 living in 1247 Houses. Total area of Garagaparru is 1170 hectares.
Bhimavaram is the Nearest Town to Garagaparru. Bhimavaram is 5 km from Garagaparru. Road connectivity is there from Bhimavaram to Garagaparru.
Vendra Rail Way Station , Bhimavaram Jn Rail Way Station are the very nearby railway stations to Garagaparru. Also you can consider railway Stations from Near By town Bhimavaram. Bhimavaram Jn Rail Way Station , Bhimavaram Town Rail Way Station are the railway Stations near to Bhimavaram. You can reach from Bhimavaram to Garagaparru by road after . How ever Rajamundry Rail Way Station is major railway station 57 KM near to Garagaparru
Bhimavaram APSRTC Bus Station and GP Road/Bvrm APSRTC Bus Stations are the nearby by Bus Stations to Garagaparru .APSRTC runs Number of busses from bhimavaram to tadepalligudem >>> nidadavole >>> rajahmundry and major cities to here.
Vasudha Foundation was established in the year 2002. Sri Mantena Venkata Rama Raju is the founder Chairman. It was started with Objectives of fulfilling its social responsibilities of helping the needy from diffrent sections of society. It has started its charitable services from garagaparru village, near Bhimavaram town, West Godavari District, Andhra Pradesh with development of school and providing infrastructure facilities in the school. The objectives of the Foundation are to help the people at time of Natural Disasters, conducting of Medical Camps; Finincial assistance to the poor students to persue higher education; Medial assistance to the poor people suffering from various diseases; Finincial assistance to old age homes; giving old age pension to poor and senior citizens; Finincial assistance to Institutions rendering services to orphanages, mentally and physically disabled students; distribution of clothes to the poor school children, blankets to the poor and senior citizens.
was set up in July 2001 in the memory of Byrraju Satyanarayana Raju. He was a philanthropist who believed in the development of villages and worked towards upliftment of rural lives.
Comingsoon
Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat. Donec sit amet venenatis ligula. Aenean sed augue scelerisque.
Duis aute irure dolor in reprehenderit in voluptate velit esse cillum dolore eu fugiat nulla pariatur. Excepteur sint occaecat cupidatat non proident.
Duis aute irure dolor in reprehenderit in voluptate velit esse cillum dolore eu fugiat nulla pariatur. Excepteur sint occaecat cupidatat non proident.
Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod. Donec sit amet venenatis ligula. Aenean sed augue scelerisque, dapibus risus sit amet.
Quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat. Donec sit amet venenatis ligula. Aenean sed augue scelerisque, dapibus risus sit amet.
No.1458/1,Ramnagar South,Velachery,Chennai-42
+(91) 9042566679
http://www.varmacomputers.com/